8న ఉదయం 11: 30 గంటలకు బడ్జెట్‌


 రాష్ట్ర శాసనసభలో ఈ నెల 8వ తేదీన(ఆదివారం) ఉదయం 11: 30 గంటలకు ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. శాసనసభలో హరీష్‌రావు తొలిసారిగా బడ్జెట్‌ ప్రవేశపెడుతున్నారు. రేపటి బడ్జెట్‌ నేపథ్యంలో రాత్రి 7 గంటలకు రాష్ట్ర మంత్రివర్గం సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన సమావేశం కానుంది. రాష్ట్ర బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోదం తెలుపనుంది. బడ్జెట్‌ సమావేశాలు ఈ నెల 6న ప్రారంభమైన విషయం తెలిసిందే. తొలి రోజున ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌ ప్రసంగించారు. శనివారం గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ చేపట్టి ఆమోదం తెలిపారు.